భువనేశ్వర్: ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలో రూ.1.5 కోట్ల విలువైన పాము విషాన్ని (Snake Venom) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని అమ్ముతున్న ఇద్దరిని అరెస్టుచేశారు. సంబాల్పూర్ జిల్లాలోని సిదుర్పంక్లో పాము విషాన్ని అమ్ముతున్నారని డియోగఢ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొనుగోలుదారుల్లా వెళ్లిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను కలిశారు.
తమకు పాము విషం ఒక కిలో కావాలని వారికి చెప్పారు. దీంతో వారు గాజు పాత్రలో ఉంచిన విషాన్ని తీసుకొచ్చి.. రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అరెస్టు చేశారు. అది పాము విషమేనా.. అనే విషయాన్ని తెలుసుకోవడానికి దానిని ల్యాబ్కు పంపామని పోలీసులు తెలిపారు.