న్యూఢిల్లీ: ఓ రైల్వే క్లర్క్ ప్రయాణికుడిని దారుణంగా మోసం చేశాడు. ప్రయాణికుడు ఇచ్చిన రూ.500 నోటు తీసుకుని లోపలేసుకుని రూ.20 నోటును ముందుపెట్టాడు. ఆపై టికెట్కు రూ.125 అవుతాయి, మిగతా డబ్బులు ఇవ్వమని అడిగడంతో ఆశ్చర్యపోవడం ప్రయాణికుడి వంతయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. వీడియో చూసిన రైల్వే ఉన్నతాధికారులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
రైల్ విస్పర్స్ అనే ట్విటర్ యూజర్ శుక్రవారం ఈ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. మంగళవారం ఓ ప్రయాణికుడు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్లో గ్వాలియర్కు టికెట్ టిక్కెట్ అడిగాడు. కౌంటర్లో ఉన్న గుమస్తా ప్రయాణికుడి నుంచి రూ.500 నోటు తీసుకుని, మళ్లీ ప్రశ్నిస్తూ తన వద్దనున్న రూ.20 నోటుతో మార్చాడు. రూ.20 నోటును ప్రయాణికుడికి చూపిస్తూ టిక్కెట్ ధర రూ.125 అని, మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగాడు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నార్తర్న్ రైల్వే దృష్టికి కూడా ఈ వీడియో వెళ్ళింది. దీనిపై చాలా మంది యూజర్లు స్పందించారు. చెన్నై రైల్వే స్టేషన్లో తనకు చాలాసార్లు ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్ స్పందిస్తూ చాలా ప్రమాదకరమని, తాను ఇలాంటి మాయాజాలాన్ని మొదటిసారి చూస్తున్నానని పేర్కొన్నాడు.
#Nizamuddin station booking office
Date 22.11.22
Rs 500 converted into Rs 20 by the booking clerk.@GM_NRly @RailwayNorthern @drm_dli @RailMinIndia @AshwiniVaishnaw @IR_CRB @RailSamachar @VijaiShanker5 @PRYJ_Bureau @kkgauba @tnmishra111 @AmitJaitly5 pic.twitter.com/SH1xFOacxf— RAILWHISPERS (@Railwhispers) November 24, 2022