జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న ఓ స్టార్ హోటల్లో భారీ చోరీ జరిగింది. హోటల్ రూమ్నుంచి రెండు కోట్ల విలువైన ఆభరణాలు, 95 వేల నగదును దోచుకెళ్లారు. హోటల్ క్లార్క్స్ అమెర్లో ఈ ఘటన జరిగింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ భాటియా కుమార్తె వివాహాన్ని ఆ హోటల్లో నిర్వహించారు. అయితే పెళ్లికి వచ్చినవారంతా హోటల్లోని లాంజ్ ఏరియాలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తులు రూమ్లో ఉన్న రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 95వేల నగదును ఎత్తుకెళ్లినట్లు రాహుల్ భాటియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ సిబ్బంది ఈ చోరీకి పాల్పడినట్లు భాటియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీనిపై హోటల్ యాజమాన్యం ఇంకా ప్రకటన చేయలేదు.