న్యూఢిల్లీ: తన బావ రాబర్ట్ వద్రాను కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా వేధిస్తున్నదని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. హర్యానాలోని శికోపూర్లో జరిగిన భూ లావాదేవీల కేసులో రాబర్ట్ వద్రాపై గురువారం ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎటువంటి దర్యాప్తునైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తన సోదరి ప్రియాంకా గాంధీతో పాటు ఆమె కుటుంబం ఆ విచారణను ఎదుర్కొంటుందన్నారు. పదేళ్లుగా రాబర్ట్ వద్రాను వెంటాడుతున్నారని, దానిలో భాగంగానే తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. రాజకీయ కక్షతో కూడిన వేధింపులు జరుగుతున్నాయని, ఈ సమయంలో తాను రాబర్ట్, ప్రియాంకా, వారి పిల్లలకు అండగా నిలుస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. సత్యం ఎప్పటికీ వర్ధిల్లుతుందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.
గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే మోదీ సర్కారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత , రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. వద్రాకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, వందలాది గంటల ప్రశ్నించినా ఫలితం లేదని, కానీ ప్రభుత్వం మాత్రం మళ్లీ మళ్లీ అదే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కోనున్నట్లు ఆయన చెప్పారు. ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుందని ఆయన అన్నారు.
శికోపూర్లో ఉన్న 3 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం వద్రాకు 7 కోట్లకు అమ్మింది. కానీ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వద్రా కంపెనీ అదే భూమిని 58 కోట్లకు అమ్ముకున్నది. భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
My brother-in-law has been hounded by this government for the last ten years. This latest chargesheet is a continuation of that witch hunt.
I stand with Robert, Priyanka and their children as they face yet another onslaught of malicious, politically motivated slander and…
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2025