పాట్నా : బీహార్లో అసెంబ్లీలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వర్షాకాల సమావేశాలు తొలి రోజు సందర్భంగా హెల్మెట్లు, నల్ల రంగు మాస్క్లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. మార్చి 23వ తేదీన అసెంబ్లీలో జరిగిన సంఘటనను నిరసిస్తూ.. ఆర్జేడీ ఎమ్మెల్యేలు నితీశ్ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత సమావేశాల్లో ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. నితీశ్ ప్రభుత్వ పాలన పట్ల భయంగా ఉందని, తమపై ఎక్కడ దాడి చేస్తుందో అన్న నేపథ్యంలో హెల్మెట్లు ధరించినట్లు ఆర్జేడీ ఎమ్మెల్యేలు తెలిపారు. సభ శాంతియుంగా సాగాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని, కానీ ప్రజల కోసం అనేక నిరసన ప్రదర్శనలు చేపడుతామని, నిరసన చేపట్టేవారిని అసెంబ్లీలో కొడుతారా అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు.