శబరిమల: కేరళలోని శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయం రూ.200 కోట్లు దాటింది. రెండు నెలల మండల పూజ దీక్షాకాలం డిసెంబర్ 27వ తేదీన ముగియనున్నది. అయ్యప్ప దేవస్థానంకు గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు ఇవాళ తెలిపింది. టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఇంకా లెక్కిస్తున్నామని, పూర్తి ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు భక్తుల సమర్పించిన కానుకల ఆదాయం 63.89 కోట్లు కాగా, అరవన ప్రసాదం అమ్మకాల ద్వారా 96.32 కోట్లు, అప్పం ప్రసాదం ద్వారా 12.38 కోట్లు వచ్చినట్లు ప్రశాంత్ తెలిపారు.
మండల పూజ సమయంలో డిసెంబర్ 25వ తేదీ నాటికి సుమారు 31,43,163 భక్తులు ఆలయాన్ని సందర్శించారు. 7,25,049 మందికి ఉచిత భోజనం పెట్టారు. బుధవారం రాత్రి 11 ఆలయాన్ని మూసివేయనున్నారు. మకరవిలక్కు పండుగ కోసం మళ్లీ డిసెంబర్ 30వ తేదీన ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మరో వైపు శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో సోమవారం కూడా భక్తులు ఆలయాన్ని విజిట్ చేశారు. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
14 hours of torture for Ayyappa devotees!
Stranded without food, water, or even basic sanitation. Sabarimala has turned into a nightmare.
And this is not just mismanagement by the administration, it’s deliberate harassment of devotees by Anti-Sanatani Communist govt! pic.twitter.com/JUSNdN3lbm
— Anoop Antony (@AnoopKaippalli) December 26, 2023