న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా జరిగే కవాతులో మేజర్ జెర్రీ బ్లెయిజ్, ఆయన సతీమణి కెప్టెన్ సుప్రీత రికార్డు సృష్టించబోతున్నారు. వీరిద్దరూ వేర్వేరు కంటింజెంట్లలో సభ్యులుగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో కవాతు చేయబోతున్నారు. దంపతులు కవాతు చేయడం గణతంత్ర దినోత్సవాల చరిత్రలో ఇదే తొలిసారి అని మేజర్ బ్లెయిజ్ చెప్పారు.
ఈ అవకాశం కాకతాళీయంగా వచ్చిందని చెప్పారు. 2023 జూన్లో తమకు వివాహం జరిగిందని తెలిపారు. సుప్రీత మాట్లాడుతూ, మొదట తాను ఎంపిక పరీక్షలో విజయం సాధించానని, ఆ తర్వాత తన భర్త రెజిమెంట్లో ఎంపికయ్యారని చెప్పారు.