Republic Day : కేంద్రం ప్రభుత్వం రూపొందించిన గణతంత్ర దినోత్సవాల ఆహ్వాన పత్రిక ఈసారి ప్రత్యేకతను సంతరించుకుంది. గణతంత్ర దినోత్సవాల ఆహ్వాన పత్రికపై ఔషధ మొక్కల విత్తనాలను కూడా ఉంచారు. గణతంత్ర దినోత్సవానికి వచ్చే ఆహ్వానితులకు ఈ కార్డులు అందజేశారు. దీని వెనుక ఆలోచన ఏమిటంటే.. గణతంత్ర దినోత్సవం ముగియగానే వాటిని చెత్తబుట్టలో విసిరేయకుండా… దానిని తోటలో నాటేలా ప్రణాళికలు వేశారట. అశ్వగంధ, ఉసిరి, అలోవెరా లాంటి ఔషధ మొక్కలను తోటలో నాటేందుకే ఇలా చేశారని తెలుస్తోంది. అలోవేరా మొక్క కోసం ఈ కార్డు నాటండి అని కూడా స్పష్టంగా ఉంది. ఇలా ప్లాంటబుల్ కార్డులను ఉపయోగించడం పర్యావరణానికి అనుకూలమని, ఇవి పర్యావరణ కార్డులని అధికారులు అంటున్నారు. వ్యర్థాల ఉత్పత్తిని ఇవి తగ్గిస్తాయని అన్నారు. ఇలాంటి కార్డులను ఓ కుండీలో వేసి వుంచవచ్చు. ఆ తర్వాత వాటికి నీళ్లు పోస్తే మొక్కలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరిలో పర్యావరణ స్పృహను పెంచడానికే కేంద్రం ఇలాంటి కార్డులను తయారు చేసిందని అధికారులు అంటున్నారు.