న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఎథిక్స్ కమిటీ (Parliament Ethics Committee)రూపొందించిన తీర్మానాన్ని కమిటీ ఆమోదించిందినట్లు ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ సోన్కర్ తెలిపారు. ఇవాళ జరిగిన మీటింగ్లో ఆ రిపోర్టుపై తీర్మానం చేశామని, ఆ తీర్మానానికి ఆరుగురు సభ్యులు ఆమోదం తెలిపారని, మరో నలుగురు సభ్యులు దాన్ని వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. లోక్సభ స్పీకర్ చాలా సవివరమైన నివేదికను రేపు అందించనున్నట్లు వినోద్ తెలిపారు. కమిటీ రిపోర్టును 6-4 తేడాతో ఆమోదించామన్నారు. అయితే తుది నిర్ణయం స్పీకరే తీసుకుంటారని వినోద్ వెల్లడించారు. ఎథిక్స్ కమిటీ ఫిక్స్ అయినట్లు వస్తున్న ఆరోపణలను ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ ఖండించారు. వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని ప్రభుత్వంపై పార్లమెంట్లో ప్రశ్నలు వేసినట్లు ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.