Relation Ships | స్త్రీ, పురుషుల మధ్య సంబంధ బాంధవ్యాలపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) సంచలన విషయాలు బయట పెట్టింది. ఈ సర్వే ప్రకారం నాలుగు శాతం మంది మగాళ్లు.. తమ జీవిత భాగస్వాములతో కంటే ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారని తెలుస్తున్నది. పురుషులతో పోలిస్తే.. తమ జీవిత భాగస్వాముల కంటే ఎక్కువ మందితో వివాహేతర సంబంధం గల మహిళలు కేవలం 0.5 శాతం మంది మాత్రమే. 2019-2021 మధ్య నిర్వహించిన సర్వే వివరాలను ఎన్ఎఫ్హెచ్ఎస్ శుక్రవారం బయట పెట్టింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 707 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు.
రాజస్థాన్తోపాటు హర్యానా, చండీగఢ్, జమ్ముకశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, అసోం, కేరళ, లక్ష్యద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషుల అభిప్రాయాలు సేకరించారు. రాజస్థాన్లో ప్రతి వంద మందిలో ఇద్దరు పురుషులు, ప్రతి వంద మందిలో ముగ్గురు మహిళలు తమ జీవిత భాగస్వామి కంటే ఎక్కువ మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారని ఈ సర్వే చెబుతున్నది.
మధ్యప్రదేశ్లో 2.5 మందితో ఒక మహిళ, 1.6 మందితో పురుషులు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు.
కేరళలో 1.4 మందితో మహిళ, జీవిత భాగస్వామితో పురుషులు లైంగిక జీవితం గడుపుతున్నారు.
జమ్ముకశ్మీర్లో 1.5 మందితో మహిళలు, 1.1 మందితో పురుషులు వివాహేతర జీవిత సంబంధం సాగిస్తున్నారు.
హర్యానాలో 1.8 మందితో మహిళలు, 1.5 మందితో పురుషులు వైవాహికేతర సంబంధంతో జీవితం సాగిస్తున్నారు. అసోంలో 2.1 మందితో మహిళలు, 1.8 మందితో పురుషులు వివాహేతర జీవనం సాగిస్తున్నారు.
దేశవ్యాప్తంగా జనాభా వృద్ధిరేటు నియంత్రణలోకి వచ్చింది. గత మే నెలలో ఎన్ఎఫ్హెచ్ఎస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒక మహిళ సగటున ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నది. 2015-16లో సగటున 2.2 మంది పిల్లలకు ఒక మహిళ జన్మనిచ్చింది. 96 శాతం మంది మంచి తాగునీటి వసతులు ఉన్నాయని, 69 శాతం మంది మెరుగైన పారిశుద్ధ్య వసతులు ఉన్నాయని చెప్పారు.