న్యూఢిల్లీ: ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని, రెడ్లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ను ఆఫ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘రైతులు కాలుకొయ్యలను తగలబెట్టకుండా చర్యలు తీసుకోవాలని పొరుగు రాష్ర్టాలను ఎంత కోరినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి. వారానికి ఒక్కరోజైన సొంత వాహనాలను వాడవద్దు. ఇలా కనీస చర్యలు చేపడితే కొంతవరకైనా కాలుష్యాన్ని నివారించగలం’ అని సూచించారు.