న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 24న దుబాయ్లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్పై పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మంచిగా లేనందున దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు బాగా లేనట్లయితే ఈ మ్యాచ్పై పునరాలోచించాలని నేను భావిస్తున్నా’ అని మీడియా ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి హత్య చేస్తున్నారు. గత రెండు వారాల్లో 11 మంది పౌరులు ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఈ నెల 24న జరుగనున్న టీ 20 మ్యాచ్పై పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలోని పలు వర్గాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్ వ్యక్తమవుతున్నది.