న్యూఢిల్లీ : వచ్చే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనుకుంటున్న ఏ పార్టీ మద్దతు ప్రకటిస్తే.. తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ .. గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ)తో పాటు కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ గోవా డెస్క్ ఇన్చార్జి మహువా మోయిత్రా చేసిన ప్రకటన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పొత్తుపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన ప్రకటనను పత్రికల్లో చదివానని, అధికారిక ప్రకటన కోసం వేచిచూడాలన్నారు. బీజేపీని సొంతంగా ఓడించే సత్తా కాంగ్రెస్కు ఉందని, కానీ బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీ అయినా కాంగ్రెస్కు మద్దతివ్వాలనుకుంటే నేనెందుకు నో చెప్పాలి? అన్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ 2017లో అత్యధికంగా 17 సీట్లు గెలుచుకున్నప్పటికీ, గత ఐదేళ్లలో కాంగ్రెస్ బలం తగ్గుతూ వచ్చింది.