జైపూర్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా సాగిస్తున్న పోరుకు తాను మద్దతిస్తానని, అవసరమైతే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఢిల్లీలోని కొందరు నాయకులు కుక్క చనిపోయినప్పటికీ సంతాపం ప్రకటిస్తారని, అయితే ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనోద్యమం చేస్తూ 600 మంది రైతులు మరణించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.