వాషింగ్టన్ : భారత్, పాక్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగాలని, తద్వారా ఇరుదేశాల మధ్య ప్రజలకు మేలు జరుగుతుందని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం వద్దని మీడియా సమావేశంలో సూచించారు. భారత్తో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్న ఆయన.. పాక్తో సంబంధాలపైనా స్పందించారు.
ఇరుదేశాలతో అమెరికాకు సంబంధాలున్నాయని, భారత్-పాక్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగాలని అమెరికా కోరుకుంటుందన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుందంటూ పాక్తో భారత్ చర్చలు జరుపని విషయం తెలిసిందే 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు పాక్తో చర్చలుండవని స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్తో ద్వైపాక్షిక సంబంధాలు సైతం తెగిపోయాయి.
ఇరుదేశాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, రెండుదేశాల మధ్య ఖచ్చితంగా విభేదాలున్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓ ప్రశ్నకు ‘ఇది యుద్ధ యుగం కాదు’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సలహాను ప్రపంచదేశాలు స్వాగతించాయని నెడ్ గుర్తు చేశారు. జీ20 సదస్సులోనూ ప్రశంసలు లభించాయని, అమెరికా దీన్ని స్వాగతిస్తుందన్నారు.