న్యూఢిల్లీ, జూలై 17 : ప్లాస్టిక్ కరెన్సీని భారత్లో ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రూ. 20, రూ. 10 లాంటి తక్కువ విలువ కలిగిన నోట్లను తొలి దశలో ప్రవేశపెడుతుంది. వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించి, అది పూర్తిగా విజయవంతమైతే తర్వాత పెద్ద నోట్లు విడుదలపై నిర్ణయం తీసుకుంటుంది.
2027 నుంచి పూర్తి స్థాయిలో ఈ పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కొత్త పాలిమర్ నోట్లతో పాటు పేపర్తో తయారు చేసిన కరెన్సీ నోట్లు కూడా అందుబాటులో ఉంటా యి. పాత నోట్ల స్థానాన్ని కొత్త నోట్లు భర్తీ చేయవని, రెండూ ఉనికిలో ఉంటాయని ఆర్బీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కాగితంతో తయారవుతున్న సంప్రదాయ కరెన్సీ నోట్ల కన్నా ఈ పాలిమర్ నోట్లు పటిష్టంగా ఉంటాయి.