ముంబై: టాటా గ్రూపు చైర్మెన్ రతన్ టాటా తన చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. 85 ఏళ్ల రతన్ టాటా.. ఇవాళ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను పోస్టు చేశారు. తన సోదరుడు జిమ్మీ నావెల్ దిగిన ఫోటోను రతన్ అప్లోడ్ చేశారు. ఆ ఫోటోను 1945లో దిగినట్లు తెలుస్తోంది. ఓ సైకిల్పై తమ పెంపుడు శునకంతో ఇద్దరు అన్నాదమ్ములు ఫోటోకు ఫోజు ఇచ్చారు. ఆ రోజులు ఎంతో సంతోషంగా గడిచాయని, ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డు ఉండకపోయేదని రతన్ టాటా తన ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. 78 ఏళ్ల క్రితం నాటి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోకు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.