Rashtrapati Bhavan ; రాష్ట్రపతి భవన్ సందర్శనను ఐదు రోజుల పాటు నిలిపివేయనున్నారు. జనవరి 25 నుంచి 29వ తేదీ వరకు సాధారణ ప్రజలను అనుమంతిచరు. గణతంత్ర దినోత్సవంతో పాటు బీట్ ది రిట్రీట్ కార్యక్రమం ఉండడంతో రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. రిపబ్లిక్ డే, బీట్ ది రిట్రీట్ వేడుక ఉన్నందును జనవరి 25 – 29 వరకు రాష్ట్రపతి భవన్ను చూడ్డానికి వచ్చేవాళ్లకు అనుమతి లేదు అని తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు.
భారత 74వ గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ ఎల్సిసి ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్గా రావడం ఇదే మొదటిసారి. భారత సైన్యానికి చెందిన పలు దళాలు కర్తవ్య పథ్లో సోమవారం ఉదయం రిపబ్లిక్ డే పరేడ్ రీహార్సల్ నిర్వహించాయి. అయితే.. ఈ వేడుకల సందర్భంగా గౌరవ వందనంలో ఎలాంటి మార్పు లేదని రాష్ట్రపతి భవన్ పోయిన వారం ఒక ప్రకటనలో తెలిపింది.