ముంబై: వివాదాస్పద ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా మహారాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఓ అధికారిణి మహారాష్ట్ర డీజీపీగా నియమితులవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ పన్సాల్కర్ డీజీపీగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
బీజేపీ నేత ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అప్పుడు ఆమె ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు రెండు కేసులు నమోదయ్యాయి.