భోపాల్, డిసెంబర్ 10: ఛత్తీస్గఢ్ కొత్త సీఎంగా ఆదివాసీ నేత విష్ణుదేవ్ సాయ్ని ఎంపిక చేసిన బీజేపీ అధిష్ఠానం.. ఇప్పుడు మిగతా సీనియర్లను సంతృప్తి పరిచేలా మిగతా పోస్టుల విషయంలో కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకొనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్ సావో(ఓబీసీ నేత), విజయ్ శర్మ(బ్రాహ్మిణ్)లకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించన్నుట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా సీఎం పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన రాజ్పుత్ వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ సీఎం రమణ్ సింగ్ను అసెంబ్లీ నూతన స్పీకర్గా చేసే అవకాశం ఉన్నదని తెలిపాయి.