న్యూఢిల్లీ: రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్రం మీడియా, సోషల్ మీడియా సంస్థలకు శనివారం పలు సూచనలు జారీ చేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి వార్తల ప్రసారం, సమాచారం ప్రచురణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు విషయాలను అడ్డుకోవాలని సూచించింది.
సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, నకిలీ సందేశాలు విస్తృతంగా వ్యాప్తి చెందడాన్ని గుర్తించామని, ఇవి మత సామరస్యాన్ని, శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని కేంద్ర ఐటీ, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.