Ram Mandir Flag | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి సిద్ధమవుతున్నది.
సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో రామ మందిరంపై ఎగుర
వేసేందుకు ప్రత్యేకంగా జెండాను సిద్ధం చేశారు. జెండాపై సూర్యుడు, కోవిదర్ చెట్టు (దేవ కాంచన వృక్షం),
శ్రీరామం నినాదాన్ని చిత్రీకరించారు. సూర్యుడు, కోవిదర్ వృక్షానికి ఎందుకు జెండాలో ఎందుకు స్థానం
కల్పించారో తెలుసుకుందాం..
వాస్తవానికి సూరుడ్య రాముడి వంశానికి (సూర్యవంశం) ప్రతీక. కోవిదర్ వృక్షం అయోధ్య రాజ్యం శక్తి,
సార్వభౌమాధికారానికి చిహ్నంగా ఉండేదని ప్రతీతి. మర్రి చెట్టు భారతదేశ జాతీయ వృక్షమైనట్లుగా కోవిదర్
వృక్షం సైతం అయోధ్యకు రాజవృక్షం. ఉత్తరప్రదేశ్ కల్చర్ డిపార్ట్మెంట్కు చెందిన అయోధ్య రీసెర్చ్
ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ లువ్కుష్ ద్వివేది దేశవ్యాప్తంగా వాల్మీకి రామాయణంపై కోవిదర్ చెట్టుకు
సంబంధించి రూపొందించిన చిత్రాలను అధ్యయనం చేయాలని పరిశోధకుడు లలిత్ మిశ్రాకు
సూచించారు. దీంతో పాటు పద్యాలను జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు.
త్రేతాయుగంలో అయోధ్య రాజ్యం జెండాపై కోవిదర్ చెట్టు ఉండేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. మహారాణా ప్రతాప్ వంశస్థుడైన రాణా జగత్ సింగ్ తన కాలంలోనే వాల్మీకి రామాయణం మొత్తాన్ని చిత్రీకరించాడు. ఇందులో భరతుడు తన సైన్యంతో చిత్రకూట్కు వచ్చి శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి రావాలని కోరిన సంఘటన గుర్తించి సైతం ప్రస్తావించబడి ఉంది. వనవాస సమయంలో భరద్వాజ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న రాముడికి ఎవరో వస్తున్నట్లుగా అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. అప్పుడు లక్ష్మణుడికి చూడమని చెబుతాడు.
ఉత్తరం వైపు నుంచి వస్తున్న సైన్యానికి చెందిన రథంపై జెండాను చూసి లక్ష్మణుడికి సైన్యం అయోధ్య వస్తున్నట్లుగా అర్థం చేసుకుంటాడు. ఆ జెండాపై దేవ కాంచన వృక్షం చిత్రం కనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలోని 96వ ఖండంలోని 18వ శ్లోకంలో లక్ష్మణుడు సైన్యం జెండాలోని కోవిదర్ వృక్షాన్ని చూసి.. సైన్యం అయోధ్య నుంచి వచ్చినట్లుగా గుర్తించినట్లు ఉంది. దీనిపై పరిశోధ జరుపాలని కోరుతూ బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జ్ఞానేశ్వర్ చౌబే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.
ఇటీవల రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ లలిత్ మిశ్రా జెండా
ముసాయిదాను సైతం అందజేశారు. ఐదుగురు సభ్యుల కమిటీ కూడా కొన్ని మార్పులు చేయాలని
సూచించింది. రేవాలోని హర్దువాకు చెందిన చెందిన లలిత్ మిశ్రా వీటిని సిద్ధం చేశారు. దేవ కాంచన వృక్షం ప్రస్తావన పురాణాల్లో ఉన్నది. కశ్యపుడు రుషి ఈ చెట్టును సృష్టించాడు. ఈ చెట్టు ప్రస్తావన హరివంశ పురాణంలో సైతం ప్రాస్తవన ఉన్నది.