అయోధ్య: శ్రీరామ జన్మభూమిలో నిర్మితమవుతున్న రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 16 నుంచి 22 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. పూజా కార్యక్రమాలు వారణాసికి చెందిన వైదిక కర్మకాండ నిష్ణాతుడు పండిట్ లక్ష్మీకాంత్ మథురనాథ్ దీక్షిత్ (86) ఆధ్వర్యంలో జరుగుతాయి.
17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేకం చేయించిన పండిట్ గగ భట్ వంశానికి చెందినవారు పండిట్ లక్ష్మీకాంత్ మథురనాథ్ దీక్షిత్. బాలుని రూపంలోని శ్రీరాముని విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. భారత దేశంతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలుగల థాయ్లాండ్ పవిత్రమైన మట్టిని పంపిస్తున్నది. జోధ్పూర్లోని మహర్షి సాందీపని రామ్ ధరమ్ గోశాల నుంచి 600 లీటర్ల నెయ్యి అయోధ్యకు చేరుకుంది. 10 ఎద్దులతో కూడిన ఐదు బండ్లు నవంబరు 27న బయల్దేరి, 1,058 కిలోమీటర్లు ప్రయాణించి, డిసెంబరు 7 మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు తీసుకొచ్చాయి.