న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఓ గమ్మత్తు ఘటన జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(MP Raghav Chadha)ను ఓ కాకి అటాక్ చేసింది. ఆ ఘటనకు చెందిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వర్షాకాల సమావేశాలకు వచ్చిన రాఘవ్.. పార్లమెంట్ ఆవరణలో ఫోన్ మాట్లాడుతూ కనిపించారు. అయితే ఆ ఫోన్ మాట్లాడుతున్న సమయంలో.. ఓ కాకి ఆయనపై అటాక్ చేసింది. ఎంపీ రాఘవ్ నెత్తిపై కాకి పొడిచింది.
ఆ ఘటనకు చెందిన ఫోటోలను బీజేపీకి చెందిన ఢిల్లీ యూనిట్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. జూట్ బోలే కవ్వా కాటే అంటూ ఆ ఫోటోకు కామెంట్ పెట్టారు. ఇన్నాళ్ల వరకు ఆ మాట విన్నాం, కానీ ఇప్పుడు అబద్దాలు చెప్పిన ఎంపీ రాఘవ్ను కాకి పొడిచేది చూశామని పేర్కొన్నారు.
ఇక బీజేపీ ఎంపీ తేజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆ ఫోటోపై ఓ సెటైర్ వేశారు. కాకి అటాక్ ఫోటోను చూసి తన గుండె తరుక్కుపోయిందని, బహుశా ఎంపీగారి ఆరోగ్యం బాగుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
झूठ बोले कौवा काटे 👇
आज तक सिर्फ सुना था, आज देख भी लिया कौवे ने झूठे को काटा ! pic.twitter.com/W5pPc3Ouab
— BJP Delhi (@BJP4Delhi) July 26, 2023