న్యూఢిల్లీ: నాగాలాండ్ ఫైరింగ్ ఘటనపై రాజ్యసభలో రభస చోటుచేసుకుంది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే నాగాలాండ్ ఫైరింగ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఈ విషయమై తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాల చేశారు. దాంతో ఛైర్మన్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ప్రతిపక్ష ఎంపీలు తమ పట్టువిడువలేదు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.