జైపూర్: బీకనీర్ రాజకుటుంబ సభ్యురాలు, రాజమాత సుశీలా కుమారి (94) ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం కన్నుమూశారు. ఆదివారం పూర్తి రాజ లాంఛనాలతో సుశీలా కుమారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అప్పటి వరకు ప్రజల సందర్శనార్థం సుశీలా కుమారి భౌతిక కాయాన్ని బికనీర్లోని జునాగఢ్ కోటలో ఉంచనున్నట్లు వెల్లడించారు.
సుశీలా కుమారి మనవరాలు సిద్ధి కుమారి భారతీయ జనతాపార్టీ తరఫున బికనీర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె శుక్రవారం తన నానమ్మ మరణవార్త తెలియగానే ఆస్పత్రికి వెళ్లారు. కాగా, సుశీలా కుమారి 1988లో తన భర్త కర్నిసింగ్ మరణించినప్పటి నుంచి రాజ కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టుకొచ్చారు.