చెన్నై, జూలై 12: సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారు. భవిష్యత్తులోనూ తాను రాజకీయా ల్లోకి రాబోనని స్పష్టం చేశారు. ఆయన స్థాపించిన రజినీ మక్కల్ మండ్రమ్ (ఆర్ఎంఎం)ను కూడా రద్దు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. చెన్నైలో ఆర్ఎంఎం ఆఫీస్ బేరర్లతో జరిగిన కార్యక్ర మంలో రజినీ మాట్లాడుతూ.. తమ ఆలోచన వాస్తవ రూపం దాల్చలే దని అన్నారు. ఆర్ఎంఎం రద్దు అయినా రజినీకాంత్ ఫ్యాన్స్ ఫోరం మాత్రం అలాగే కొనసాగుతుందని తెలిపా రు. గతేడాది డిసెంబర్లో రాజకీ యాల్లోకి రాబోతున్నానని చెప్పిన రజినీ.. కొద్దికాలానికే ఆరోగ్యం సహకరించక నిర్ణయాన్ని మార్చుకున్నారు.