జైపూర్: రాజస్థాన్లోని చిత్తోరగఢ్ పట్టణంలో రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎంతగా అంటే ఇవాళ అక్కడ గతంలో ఎన్నడూ లేనంతగా 0.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దాంతో చిత్తోరగఢ్ ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. చిత్తోరగఢ్తోపాటు రాజస్థాన్లోని ఇంకా చాలా ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చీత్తోరగఢ్ తర్వాత అత్యల్పంగా భిల్వారాలో అత్యల్పంగా 2.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత అంటాలో 3.4 డిగ్రీ సెల్సియస్, సికార్లో 4 డిగ్రీ సెల్సియస్, దబోక్లో 4.4 డిగ్రీ సెల్సియస్, సవాయ్ మాధోపూర్లో 4.7 డిగ్రీ సెల్సియస్, సిరోహి, ధోల్పూర్, బుండీలో 4.8 డిగ్రీ సెల్సియస్, బనస్తలీ, ఎరాన్పురలో 5 డిగ్రీ సెల్సియస్, సంగారియాలో 5.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఇక, రాజస్థాన్ రాజధాని జైపూర్లో మంగళవారం రాత్రి 6.1 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.