జైపూర్: రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కు చెందిన ఓ పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. మే 14వ తేదీ ఆ పేపర్ లీకైటన్లు తెలుస్తోంది. ఆ పేపర్కు చెందిన స్క్రీన్షాట్ వైరల్ అయ్యింది. 14వ తేదీన పరీక్ష జరుగుతున్న రెండవ షిఫ్ట్ సమయంలో జైపూర్లోని దివాకర్ పబ్లిక్ స్కూల్ సెంటర్ సూపరిటెండెంట్ నిర్దేశిత సమయం కన్నా ముందే ఎన్విలాప్ పేపర్ను ఓపెన్ చేశారు. ఆ షిఫ్ట్లో జరగాల్సిన పరీక్షను మళ్లీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఇవాళ తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పేపర్ లీకేజీకి సంబంధించిన కేసును రిజిస్టర్ చేశారు. మే 13 నుంచి 16వ తేదీ వరకు కానిస్టేబుల్ పోస్టు కోసం రాజస్థాన్ పోలీసులు రాతపరీక్షను నిర్వహించారు.