జైపూర్ : రాజస్ధాన్లోని అళ్వార్ జిల్లా సరై మొహల్లాలో 300 ఏండ్ల నాటి శివాలయాన్ని అధికారులు కూల్చివేసిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశం పెనుప్రకంపనలు సృష్టిస్తున్న నేపధ్యంలో రాజస్దాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు.
ఆక్రమణల తొలగింపు నిర్ణయం గతంలో వసుంధర రాజే నేతృత్వంలోని బీజేప ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. ఆక్రమణలను బుల్డోజర్లతో నేలమట్టం చేయాలని నిర్ణయించిన బీజేపీ ఇప్పుడు అశోక్ గెహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ను నిందిస్తోందని దుయ్యబట్టారు.
శివాలయం కూల్చివేతతో కాషాయ నేతలు గెహ్లోత్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ ఘటనపై సరై మొహల్ల నగర పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అల్వార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, స్థానిక ఎమ్మెల్యేపై పోలీసు కేసు నమోదైంది.