ED Notice | రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సోమవారం ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో స్పష్టం చేసింది. రసాయన ఎరువుల ఎగుమతిలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అగ్రసేన్పై అభియోగాలు చేస్తోంది. ఇదే కేసులో అగ్రసేన్ గెహ్లాట్.. ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి గత నెలలో విచారణకు హాజరయ్యారు.
గతేడాది జూలైలో రాజస్థాన్లోని అగ్రసేన్ గెహ్లాట్ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు జరిపింది. సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ మధ్య రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ దాడులు జరుగడం గమనార్హం. అయితే, ఈ దాడులకు తమ పార్టీ భయపడబోదని కాంగ్రెస్ పేర్కొంది. అగ్రసేన్ గెహ్లాట్ తనయుడు అనుపమ్ కూడా ఈడీ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.