Indian Railway | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో కనీసం 9వేల స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని.. ఆయా స్క్రీన్లపై ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారతీయ రైల్వేతో పాటు దూరదర్శన్ డీడీ న్యూస్, డీడీ నేషనల్ ఛానెల్స్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యప్రసారం చేయనున్నారు.
ఇప్పటికే అయోధ్య ధామ్లో ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలోని రామ్ కథా సంగ్రహాలయ్ వద్ద పరిమిత సామర్థ్యంతో మీడియా సెంటర్ సిద్ధంగా ఏర్పాటు చేశారు. టెలీకాస్ట్ను వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ తెలరలను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధి టైమ్ స్క్వేర్లోనూ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం కానున్నది. అలాగే వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానున్నది. 2020 ఆగస్ట్ 5న అయోధ్యలోని శ్రీరామ మందిరానికి ‘భూమి పూజ’ కార్యక్రమానికి గుర్తుగా టైమ్స్ స్క్వేర్లో రామమందిరానికి సంబంధించిన డిజిటల్ బిల్బోర్డ్ ప్లేపై అయ్యింది.