లక్నో: రైల్వే అధికారులు తనిఖీ కోసం వినియోగించే ఇన్స్పెక్షన్ కోచ్ (inspection coach) సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది దానిని తోశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఈ సంఘటన జరిగింది. గురువారం రైల్వే ఉన్నతాధికారులు ఇన్స్పెక్షన్ కోచ్లో సుల్తాన్పూర్ నుంచి లక్నోకు బయలుదేరారు. అయితే నిహల్గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన ట్రాక్పై అది ఆగిపోయింది. సాంకేతిక సమస్య వల్ల అక్కడి నుంచి కదలలేదు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కాగా, రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. రైల్వే సిబ్బందిని అక్కడకు రప్పించారు. మెయిన్ ట్రాక్లో నిలిచిన ఇన్స్పెక్షన్ కోచ్ను లూప్ లైన్ వరకు తోయించారు. అనంతరం సాంకేతిక సమస్యను సరిచేయడంతో అది అక్కడి నుంచి కదిలింది. దీంతో రైల్వే అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కొందరు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH : Railway men made to push train coach after snag in UP's Amethi.
The incident happened in Uttar Pradesh's Amethi where a DPC coach, mainly used by Railway officials for inspection, broke down on the main line near the Nihalgarh Railway Station.#Amethi #IndianRailways… pic.twitter.com/2qlc7nE7f2— upuknews (@upuknews1) March 22, 2024