శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఇద్దరు రైల్వే పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కానిస్టేబుల్ సురీందర్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ దేవరాజ్పై కాకపోరాలోని ఓ టీస్టార్ వద్ద ఉండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇద్దరిని వెంటనే దవాఖానకు తరలించగా.. అప్పటికే సురీందర్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా ఆ ప్రాంతానికి చేరుకొని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి.
ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 24న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో కశ్మీర్లో తీవ్రవాద దాడులు పెరిగాయి. పంచాయత్ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మూ సమీపంలో వేలాది మందిపంచాయతీ సభ్యులు హాజరయ్యే ప్రధాన ర్యాలీలో ప్రధాని ప్రసంగించనున్నారు. గత మూడువారాలుగా లోయలో భద్రతా బలగాలు, సాధారణ పౌరులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ నెలలో దాడి ఘటన జరగడం తొమ్మిదోది. ఉద్యోగాల కోసం జమ్మూకశ్మీర్కు వచ్చిన ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, స్థానిక కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా, మరో వైపు పంచాయతీ సభ్యులపై సైతం దాడి ఘటనలున్నాయి.