న్యూఢిల్లీ, ఆగస్టు 28: రైళ్లలో రెగ్యులర్ ఏసీ-3టైర్ కోచ్లతో పోలిస్తే కొత్తగా ప్రవేశపెట్టనున్న ‘ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్’ బోగీల్లో టికెట్ ధర 8% తక్కువగా ఉంటుందని రైల్వే శాఖ శనివారం వెల్లడించింది. స్లీపర్ క్లాస్ టికెట్ బేస్ ధర కంటే 2.4 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నది. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్తో తక్కువ ధరలో అత్యుత్తమ ప్రయాణానుభూతి లభిస్తుందని చెప్పింది. కేంద్ర రైల్వేశాఖ వివిధ రైల్వే జోన్లకు అదనంగా 50 ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ బోగీలను కేటాయించింది. ధరలు నిర్ణయమైనందున కొత్త బోగీలను వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లకు అనుసంధానం చేస్తారని వెల్లడించింది.