బేటీ బచావో… బేటీ పఢావో పథకం విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. బేటీ బచావో.. బేటీ పఢావో విషయంలో ఫొటో దిగడం… ఫొటోలను ప్రింట్ చేసుకోవడం లాగా కేంద్రం తీరు మారిపోయిందని దుయ్యబట్టారు. బేటీ బచావో, బేటీ పఢావో విషయంపై పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బేటీ బచావో, బేటీ పఢావో అన్న నినాదం కాకుండా, ఫొటో దిగండి… ప్రింట్ చేసుకోండి అన్న నినాదాన్ని కేంద్రం ఉంచితే బాగుంటుందని ట్విట్టర్ వేదికగా రాహుల్ తీవ్రంగా దునుమాడారు.