Rahul Gandhi : హరిద్వార్లో ఇటీవల జరిగిన ధర్మ సంసద్ నేపధ్యంలో హిందుత్వవాదులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. హిందుత్వవాదులు నిత్యం విద్వేషం, హింసను విరజిమ్ముతుంటారని రాహుల్ ఆరోపించారు. భారత్ విధ్వంసానికి వ్యతిరేకమని విద్వేషం, హింస వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని అన్నారు.
హరిద్వార్లో వేద్ నికేతన్ ధామ్ ఆధ్వర్యంలో ఇటీవల ముగిసిన ధర్మ సంసద్లో ఓ వర్గానికి వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు సాగిన నేపధ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొడుతూ విద్వేష ప్రసంగాలు ఇచ్చారని జున అఖడాకు చెందిన యతి నరసింహానద గిరి నిర్వహించిన ఈ సదస్సుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ప్రజల్లో విద్వేషం, హింసను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు మన రాజ్యాంగం, చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు.