న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ పెద్దల సభ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన సస్పెన్షన్కు గురైన 12 మంది రాజ్యసభ సభ్యులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు. సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల నిరసనకు రాహుల్ సంఘీభావం ప్రకటించారు.
కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారని 12 మంది రాజ్యసభ సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఛాయా వర్మ, రిపున్ బోరా, వినయ్ విశ్వం, రాజమణి పటేల్, డోలా సేన్, ఎలమారం కరీం, పులో దేవి నేతం, సయ్యద్ నజీర్ హుస్సేన్, ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, శాంత చెట్రి ఉన్నారు.
మరోవైపు రైతుల మృతి, ద్రవ్యోల్బణం అంశాలపై విపక్ష ఎంపీలు సభలో నినాదాలతో హోరెత్తించారు. రైతాంగం సహా ప్రజా సమస్యల పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆర్జేడీ, ఆర్జేడీ, ఐయూఎంఎల్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే పెద్దల సభ నుంచి వాకౌట్ చేశాయి.