న్యూఢిల్లీ, సెస్టెంబర్ 3: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మోదీ యోచన భారత దేశ ఐక్యత, రాష్ర్టాలపై దాడే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ ‘ఇండియా, అనగా భారత్ రాష్ర్టాల సమ్మేళనం’ అని ఒకే దేశం-ఒకే ఎన్నిక గురించి ఆలోచించడమంటే దానిపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు.