న్యూఢిల్లీ : అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం సందర్భంగా మంగళవారం ఎంపీలకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మిల్లెట్ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశారు. ఈ మిల్లెట్ లంచ్లో మిల్లెట్ సూప్ నుంచి రాగి రోటి వరకూ మిల్లెట్స్తో చేసిన ఆహార పదార్ధాలను వడ్డించనున్నారు. రాగి దోసె, జొన్న హల్వా, సజ్జ కేక్ వంటివెన్నో నోరూరించేలా ఎంపీలకు అందించనున్నారు.
Delhi | Millet lunch – food items made of millet – prepared for lunch at the Parliament today. pic.twitter.com/005rb21rFz
— ANI (@ANI) December 20, 2022
రాగి దోసె వంటి రాగి వెరైటీలను తయారుచేసేందుకు కర్నాటక నుంచి స్పెషల్ చెప్స్ను రప్పించారు. పలు కూరగాయాలతో తయారుచేసిన కలుహులి, కొబ్బరి చట్నీ, ఫాక్స్టైల్ మిల్లెట్ కర్డ్ రైస్, రాగి హల్వా, సజ్జ ఖీర్, గజర్ కా హల్వా వంటి వంటకాలు ఎంపీలు, మంత్రులకు వడ్డించనున్నారు. ఆరోగ్యానికి మేలైన మిల్లెట్స్ను ప్రోత్సహించడంలో భాగంగా ఈ విందును ఏర్పాటు చేశారు.