Radhikapur Express | పశ్చిమ బెంగాల్లో రాధికపూర్ ఎక్స్ప్రెస్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పింది. ధూలియన్గంగ, బల్లాల్పూర్ స్టేషన్ల మధ్య వేకువ జామున ఒంటిగంట తర్వాత గంటలకు ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలు తప్పగా.. ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోగీల నుంచి ఇంజిన్ను వేరు చేసి మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కౌశిక్ మిత్రా మాట్లాడుతూ ప్రమాదం గురించి తెల్లవారు జామున 1.15 గంటలకు సమాచారం వచ్చింది. ట్రక్కును ఢీకొనడంతో రాధికపూర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందన్నారు. రైలు మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్థలానికి చేరుకొని చేరుకొని మంటలను ఆర్పివేశారన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. రైలులోని ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారన్నారు. ప్రమాదం తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.