బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 గురువారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, ఒడిశాకు చెందిన అంతర్జాతీయ సైకత శిల్పి మానస్ కుమార్ సాహూ అందమైన సాండ్ ఆర్ట్తో క్వీన్ ఎలిజబెత్ 2కు నివాళి అర్పించాడు.
ఒడిశాలోని పూరీ గోల్డెన్ సీ బీచ్లో లైట్హౌస్ సమీపంలో క్వీన్ ఎలిజబెత్ 2 సైకత శిల్పాన్ని మానస్ రూపొందించాడు. దీన్ని తయారుచేసేందుకు అతడికి ఐదు గంటల సమయం పట్టింది. 5 టన్నుల ఇసుకతో 10 అడుగుల పొడవులో రూపొందించిన సైకతశిల్పం ఆకట్టుకుంటున్నది. ఈ సైకతశిల్పం దిగువన ‘రాణికి నివాళి’ అనే సందేశాన్ని రాశాడు.