న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్లోని కరాచీకి మళ్లించారు. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన QR579 విమానాన్ని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని అత్యవసరంగా కరాచీకి డైవర్ట్ చేశారు. ఆ విమానంలో సుమారు 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. కార్గో ప్రాంతంలో పొగ వచ్చినట్లు గుర్తించారు. అయితే సురక్షితంగా విమానం కరాచీలో ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులను కిందకు దించేశారు. ఢిల్లీ నుంచి తెల్లవారుజామున 3.50 నిమిషాలకు విమానం బయలుదేరింది. ఆ తర్వాత అది కరాచీలో 5.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్ ఉన్న ప్రయాణికులు అందులో ఉన్నారు. విమానంలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఆహారం, నీళ్లు ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.