డెహ్రాడూన్ : దేవ భూమి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. 70 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఫిబ్రవరి 14న ఒకే విడుత ఎన్నికలు జరిగాయి. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం 40కిపైగా స్థానాల్లో బీజేపీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్నది. బీజేపీ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఫలితాల్లో వెనుక పడ్డారు. ప్రత్యర్థి కంటే 16 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయంపై బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో ఉత్తరాఖండ్ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి ఆశించిన ఫలితాలు సాధించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.