ఉత్తరాఖండ్ సీఎం పదవికి పుష్కర్ సింగ్ ధామీ శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్కు సమర్పించారు. అయితే రాజ్యాంగం ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఐదు సంవత్సరాల కాలం ముగిసింది. ప్రజలు కూడా తీర్పును ఇచ్చారు. అందుకే గవర్నర్కు రాజీనామా సమర్పించాను. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడే వరకూ నన్నే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగమన్నారు అని పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు.
ఉత్తరాఖండ్లో 47 సీట్లతో బీజేపీ విజయం సాధించింది. అయితే సీఎం పుష్కర్ సింగ్ ధామీ మాత్రం ఓడిపోయారు. ఈయన ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తిగా మారింది. తిరిగి పుష్కర్నే ఎన్నుకుంటారా? లేదంటే కొత్త వ్యక్తిని తెరపైకి అధిష్ఠానం తెస్తుందా? అన్నది చూడాలి.