చండీగఢ్: పంజాబ్లోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పంజాబీ లాంగ్వేజ్ను తప్పనిసరి సబ్జెక్టుగా పేర్కొంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ( Charanjith Singh Channi ) ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియమాన్ని అన్ని స్కూళ్లు కచ్చితంగా పాటించాలని చన్నీ ఆదేశించారు. ఏ పాఠశాల అయినా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కూడా తప్పనిసరిగా పంజాబీ భాషను ఉపయోగించాలని పంజాబ్ సీఎం ఆదేశించారు. అలాగే అన్ని కార్యాలయాలు తమ సంస్థ పేర్లను ఆఫీస్ ముందు ఏర్పాటు చేసే బోర్డులపై తప్పనిసరిగా పంజాబీలో రాయించాలని సీఎం చరణ్జీత్ సింగ్ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.