న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, మణిపూర్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే విడుతలో పోలింగ్ జరగనుంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 21న నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 28. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 31. ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించి, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
పంజాబ్లో 117 అసెంబ్లీ స్థానాలకు, గోవాలో 40 శాసనసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కోవిడ్ వేళ అసెంబ్లీలో పోటీపడే అభ్యర్థులకు కొత్త ఆప్షన్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్ను ఆన్లైన్ ద్వారా వేయవచ్చు అని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. పోలింగ్ బూత్లను 16 శాతం పెంచారు. పోలింగ్ బూత్ల్లో ఓటర్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు సీఈసీ చెప్పారు. ఇక కోవిడ్ మూలంగా అభ్యర్థుల నామినేషన్ను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు సుశీల్ చంద్ర స్పష్టం చేశారు.
యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును 40 లక్షలకు ఫిక్స్ చేశారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును 28 లక్షలు ఉంటుందని సీఈసీ వెల్లడించారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో సుశీల్ ఈ విషయాలను వెల్లడించారు.