చండీగఢ్: మూడు ఇతిహాసాలపై ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఈ విషయం తెలిపారు. మూడు ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, శ్రీమద్ భగవద్గీతపై ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఇతిహాసాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు సీఎం చన్నీ కార్యాలయం ఆదివారం అధికారికంగా ప్రకటించింది.