Ludhiana blast : లుధియానా కోర్టులో బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఖలిస్తానీ శక్తులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లకు లింకులు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైందని పంజాబ్ బీజీపీ సిద్ధార్ధ్ ఛటోపాధ్యాయ పేర్కొన్నారు. లుధియానా కోర్టు కాంప్లెక్స్లో గురువారం జరిగిన బాంబు పేలుళ్ల దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని చెప్పారు.
ఉగ్రవాదం, నార్కోటిక్స్ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయని, నార్కోటిక్స్ వ్యవస్ధీకృత నేరం కాగా, అది ఉగ్రవాదంతో ప్రమాదకరంగా పెనవేసుకుపోయిందని, లుధియానా కేసు ఈ తరహాలోనిదేనని అన్నారు. 24 గంటల్లో బాంబు బ్లాస్ట్ కేసును ఛేదించామని డీజీపీ తెలిపారు. ఘటనా స్ధలం నుంచి తమకు పలు క్లూలు అందాయని, అక్కడ తమకు చిరిగిన దుస్తులు, ఓ సిమ్ కార్డు, మొబైల్ ఫోన్ లభించాయని తెలిపారు.
లుదియానా బాంబు పేలుళ్ల ఘటనలో మృతుడు పేలుడు పదార్ధాలు మోసుకొస్తూ మరణించాడని ప్రాధమికంగా తాము వేసిన అంచనా నిజమేనని వెల్లడైందని చెప్పారు. 24 గంటల్లోనే ప్రధాన నిందితుడిని గుర్తించామని, అతడిని 2017లో పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తించామని తెలిపారు.