న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర పోలీసులు ఢిల్లీలోని బీజేపీ నాయకుడి ఇంటికి వచ్చారు. అయితే తనను అరెస్ట్ చేసేందుకే వారు తన ఇంటికి కారులో వచ్చారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ విమర్శించారు. తాను భయపడబోనని, ప్రజలకు వాస్తవం తెలియజేస్తానని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్యూకు సంబంధించి ఫేక్ వీడియోను నవీన్ కుమార్ జిందాల్ ఈ నెల 6న ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆప్ అధికారంలోకి వచ్చిన పంజాబ్లో నవీన్ కుమార్ జిందాల్కు వ్యతిరేకంగా రెండు కేసులు నమోదయ్యాయి. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయవాది తొలుత మొహాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత సబ్-ఇన్స్పెక్టర్ గగన్దీప్ సింగ్ బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్కు వ్యతిరేకంగా రెండో కేసు నమోదు చేశారు. దీంతో పంజాబ్ పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసం వద్దకు వెళ్లడం కలకలం రేపింది.
केजरीवाल ने पंजाब पुलिस को प्राइवेट कार PB 02 DQ 1204 मेरे घर भेजा है मुझे गिरफ्तार करने।
लेकिन मैं @ArvindKejriwal को आज फिर बताना चाहता हूँ कि मैं उससे डरने वाला नहीं हूँ। जनता को उसका सच बताकर ही रहूंगा। pic.twitter.com/YCxsml4utU
— Naveen Kumar Jindal 🇮🇳 (@naveenjindalbjp) April 9, 2022